Thursday, May 2, 2024

MLA Quota: టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణం

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురు టీఆర్‌ఎస్‌ సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పీ వెంకట్రామిరెడ్డితో శాసన మండలిలోని తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి ప్రమాణం చేయించారు.

కాగా, ఎమ్మెల్యే కోటాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ తన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ప్రమాణం చేస్తారు. ఇక, గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ స్పీకర్ మధుసూధనాచారితోపాటు బండా ప్రకాశ్‌ ఈ నెల 6 తర్వాత ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement