Friday, May 10, 2024

Breaking : చేత‌బ‌డి నెపంతో ఘ‌ర్ష‌ణ .. ముగ్గురు మృతి .. ప‌లువురికి తీవ్ర గాయాలు ..

చేత‌బ‌డి చేయిస్తున్నార‌ని క‌త్తులు, ఇత‌ర ప‌దునైన ఆయుధాల‌తో త‌ల‌ప‌డ్డారు ఇరు కుటుంబాల వారు. ఈ సంఘ‌ట‌న విశాఖ ఏజెన్సీ అనంత‌గిరి మండ‌లం టోకూరు పంచాయ‌తీ బాగ్ మ‌ర‌వ‌ల‌స గ్రామంలో జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెంద‌గా .. ఇద్ద‌రికి తీవ్ర గాయాలు అయ్యాయి. ల్లోరి డుంబు, అతని కుటుంబ సభ్యులు కిల్లో కోమటి కుటుంబసభ్యులపై చేతబడి చేస్తున్నారంటూ కత్తులు, ఇతర పదునైన ఆయుధాలతో ఎటాక్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దాడిలో కిల్లో కోమటి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు కుమారులు బలరాం, భగవాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి ప్రతీకారంగా కిల్లో కోమటి బంధువులు గొల్లూరి డుంబి, అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనతో గ్రామ శివారులో డుంబు, గ్రామంలో అతని కుమారుడు సుబ్బారావులు శవాలుగా మారారు.

దాంతో క్ష‌త‌గాత్రుల‌ని కింగ్ జార్జ్ హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించారు. స్వ‌ల్ప గాయాలు అయిన వారిని ఎస్ కోట ఆసుప‌త్రికి తీసుకువెళ్ళారు. చేతబడి చేస్తున్నారంటూ కోమటి కుటుంబంపై దాడి చేయడంతో దుంబు కుటుంబంపై గ్రామస్తులు దాడి చేశారు. పాత గొడ‌వ‌లే ఈ ఘర్షణలకు ప్రధాన కారణమని స్థానికులు చెప్పారు. అనంతగిరి, అరకు పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement