Monday, May 6, 2024

వికారాబాద్ లో 2 కే రన్ – జండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జూన్ 12 ( ప్రభ న్యూస్): తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టు కే రన్ నిర్వహిస్తున్నట్టు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం ఉదయం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తో కలిసి 2కె రణ్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరంలోకి వెళ్లిన సందర్భంగా ఈ 2కే రన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు చేరవేయాలన్నదిప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి డిఎస్పి సత్యనారాయణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement