Sunday, May 5, 2024

22న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు… పర్వదినాన ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లు – డిప్యూటీ సిఎం భట్టి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

క్రిస్మస్‌ వేడుకలపై కమిటీ సభ్యులతో శనివారం భట్టి విక్రమార్క సమీక్షించారు. ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 200 ప్రాంతాల్లో 500 మందికి, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యి మంది చొప్పున ఎంపిక చేసి గిఫ్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేయడంతో పాటు విందు ఏర్పాటు చేయాలని సూచించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement