Sunday, April 28, 2024

Summons – అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యాలు – రాహుల్ గాంధీకి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు

సుల్తానాపూర్‌ (యూపీ): కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీకి సమన్లు జారీ అయ్యాయి. జనవరి 6న కోర్టుకు హాజరు కావాలని యూపీలోని సుల్తానాపూర్‌ ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది..వాస్తవానికి నేడు రాహుల్‌ గాంధీ కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన గైర్హాజరయ్యారు.

అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భారతీయ జనతా పార్టీ నేత విజయ్‌ మిశ్రా 2018 ఆగస్టు 4న న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నవంబర్‌ 18న ఈ కేసులో వాదనలు పూర్తవ్వగా తీర్పును రిజర్వ్‌ చేస్తూ నవంబర్‌ 27కు తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. అదే సమయంలో డిసెంబర్‌ 16న కోర్టుకు హాజరు కావాలంటూ జడ్జి యోగేశ్‌ యాదవ్‌ రాహుల్‌ గాంధీకి సమన్లు జారీ చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సంతోష్‌ పాండే తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement