Sunday, May 5, 2024

Suspension – మహిళల గొడవలో జోక్యం – కానిస్టేబుల్ సస్పెండ్

నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మోపాల్ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ మూర్తిని సస్పెండ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు..ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో కానిస్టేబుల్‌ మూర్తి తలదూర్చడమే సస్పెండ్‌కు కారణమని తెలిసింది. అయితే గొడవపడిన ఇద్దరు మహిళల్లో ఒకరు సస్పెండ్‌ అయిన మూర్తి భార్యే కాగా.. మరొకరు ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్ భార్య అని సమాచారం.

కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్‌ నివాసాలు పక్కపక్కనే ఉండగా.. వారి భార్యల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ గొడవలో కానిస్టేబుల్‌ తలదూర్చి ఇన్‌స్పెక్టర్‌ భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇన్‌స్పెక్టర్‌ సీపీకి ఫిర్యాదు చేయగా.. ఆయన విచారణ జరిపించి కానిస్టేబుల్‌ మూర్తిని సస్పెండ్ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement