Sunday, May 5, 2024

Inquiry – మేడిగడ్డ, అన్నారంపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని తేల్చి చెప్పారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు కుంగిపోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయిందనే అంశంపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపడుతామని అన్నారు. ఈ మేరకు ఆయన మండలిలో ఒక ప్రకటన చేశారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరిని మేడిగడ్డ ప్రాజెక్ట్, అన్నారం ప్రాజెక్ట్ వద్దకు తీసుకెళతామని తెలిపారు. అన్ని విషయాలు తొందర్లోనే బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు? వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర అన్ని విచారణలో బయటకు వస్తాయని స్పష్టం చేశారు.

స్పీకర్, మండలి చైర్మన్ ఆదేశాలతో అసెంబ్లీ ఎదుట ముళ్ల కంచె తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇకపై పాత అసెంబ్లీ భవనంలో మండలి సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement