Friday, May 3, 2024

అమ్మబాబోయ్….కరోనా రాకూడదని మొక్కుకున్న ఎర్రబెల్లి

ఇటీవల కాలంలో పొలిటికల్ లీడర్ లైనా, సినీ స్టార్ అయినా ఏదైనా మాట్లాడితే వెంటనే సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ మొదలైపోతున్నాయి. కాగా తాజాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో ఉన్న రుద్రేశ్వర స్వామిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా తెలంగాణ కు రాకూడదని కోరుకున్నట్లు తెలిపారు. కాగా దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మీరు మొక్కుకోవటం వల్ల కరోనా ఆగిపోదు. ముందు ప్రజల సమస్యల పైన దృష్టి పెట్టండి. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి గుడిలో దేవుడికి మొక్కుకున్న అని చెబితే ప్రజలు నమ్మరంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement