Friday, April 26, 2024

Zika virus outbreak: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా కలకలం.. 66 మందికి వైరస్‌

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంటే.. మరోవైపు జికా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కాన్పుర్‌లో 30 మందికి జికా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో కాన్పూర్‌లో మొత్తం జికా కేసుల సంఖ్య 66కి చేరింది.

కాన్పుర్‌లో అక్టోబరు 23న తొలి జికా వైరస్‌ కేసు వెలుగుచూసింది. వైరస్‌ బారినపడ్డవారిలో 45 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. జికా బాధితుల్లో భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కి చెందిన పలువురు సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: COVID-19: దేశంలో కేసులు తగ్గాయి.. మరణాలు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement