Sunday, April 28, 2024

COVID-19: దేశంలో కేసులు తగ్గాయి.. మరణాలు పెరిగాయి..

దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా రోజుల తర్వాత 11 వేల దిగువకు చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,929 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 392 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయలో 12,509 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 1,46,950 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,683కు చేరింది. ఇందులో 3,37,37,468 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ తో 4,60,265 మంది బాధితులు మరణించారు. నిన్న దేశవ్యాప్తంగా 8,10, 783 టీకా డోసులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 1,07,92,19,546 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement