Friday, April 26, 2024

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయం

హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైఎస్ఆర్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోమని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా?’ అని  ఆమె ప్రశ్నించారు. ‘‘హుజూరాబాద్ ఉప ఎన్నికల వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా?, దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా? ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీచేస్తాం’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నికలు మాత్రమేనని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: కలం పక్కనెట్టి.. హలం చేతబట్టి..

Advertisement

తాజా వార్తలు

Advertisement