Thursday, April 25, 2024

జీహెచ్‌ఎంసీ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం

జీహెచ్‌ఎంసీ ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. అబిడ్స్ సర్కిల్ 14 లో గత పదిహేనేళ్ళగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ గా రమేష్ యాదవ్ పని చేస్తున్నాడు. అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఉమ గౌరీ ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని వేధించేదని వాపోయాడు. తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో ఉద్యోగం నుంచి తొలగించారని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ వేధింపులు,  ఉద్యోగం నుంచి తొలగించడంతో జీహెచ్‌ఎంసీ ఎదుట రమేష్‌ కుటుంబం పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement