Thursday, March 28, 2024

రూ.2 లక్షలను కొరికేసిన ఎలుకలు

వైద్యం కోసం దాచుకున్న డబ్బులను ఎలుకలు పటపట కొరికేశాయి. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని వేమునూరు గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలోని ఇందిరాన‌గ‌ర్ తండాలో చోటు చేసుకుంది. భూక్య రెడ్యా అనే వ్య‌క్తి కూర‌గాయ‌లు అమ్ముకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. ఇలా సంపాదించిన రూ.2 లక్షల రూపాయలను ఇంట్లో దాచి పెట్టాడు. అయితే రూ.500 నోట్ల క‌ట్ట‌ల‌ను ఎలుకలు కొరికి పడేశాయి. ఆ నోట్ల‌ను చూసి రెడ్యా బోరున విల‌పించాడు. దాంతో బాధితుడు రెడ్యా చిరిగిన నోట్లతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆ నోట్లు చెల్లుబాటు కావ‌ని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో బాధితుడి ఆవేదన చెందుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement