Saturday, April 27, 2024

మధ్యప్రదేశ్ లో నిర్భయ తరహా ఘటన.. బస్సులో మహిళపై అత్యాచారం

ఎన్ని చర్యలు తీసుకున్నా దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని కుక్షి నుంచి మనవర్‌కు బస్సు వెళ్తుండగా.. అందులో బాధిత మహిళ ఎక్కింది. ఆమె లాంగ్‌సారిలో దిగాల్సి ఉంది. అయితే, డ్రైవర్, కండక్టర్, క్లీనర్ ఆమెను లాంగ్‌సారిలో దింపలేదు. ఆమెను గంధవాణిలో దింపుతారని చెప్పారు. బస్సు ఖాళీగా ఉండటంతో కండక్టర్ బస్సును ఆపి గులాటి రోడ్డు, బాలిపూర్ రోడ్డు మధ్య ఏకాంత ప్రదేశంలో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత డ్రైవర్, క్లీనర్ కూడా ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితురాలి అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించారు.

మొత్తం ముగ్గురు నిందితుల్లో ఒకరు పరారవ్వగా.. ఇద్దరిని పోలీసుల అరెస్టు చేశారు. మరొ నిందితుడి కోసం గాలిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన కండక్టర్‌తో పాటు సహకరించిన క్లీనర్, డ్రైవర్‌పై మనవార్ పోలీస్ స్టేషన్‌లో సామూహిక అత్యాచారం కేసు కూడా నమోదు చేశారు. నిందితులపై IPC సెక్షన్లు 376,376 D,376(2)K సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వ్యక్తిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement