Tuesday, May 14, 2024

డీజిల్ భారంతో -ఎల‌క్ట్రిక్ బ‌స్సులుగా మారిన పాత బ‌స్ లు- 2 గంటలు చార్జింగ్‌ చేస్తే 200 కిలోమీటర్ల ప్ర‌యాణం

ఓ ఐడియా ఆ బస్సుల రూపు రేఖ‌ల‌నే మార్చేసింది. పాత బస్సుల‌న్నీ ఎల‌క్ట్రిక్ బస్ లుగా మారిపోయాయి.. చిత్తూరు2 డిపోలో
ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. డీజిల్‌ భారం ఆర్టీసీకి గుదిబండలా మారడంతో ఆర్టీసీ ఈ వినూత్న ఆలోచన చేసింది. ఈ బస్సుల్ని ఎల‌క్ట్రిక్ బ‌స్ లుగా మార్చేందుకు రెండేళ్ల క్రితం బెంగళూరులోని వీర వాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్‌ బస్సు పనులు పూర్తయ్యాక విజయవాడకు చెందిన ఆర్టీసీ టీమ్‌ పరీక్షించింది. ప్రస్తుతం బస్సును చిత్తూరు–2 డిపోకు తెచ్చారు.ముందుగా బస్సును బెంగళూరుకు తరలించారు.. ఇంజిన్‌, గేర్‌బాక్స్‌, డీజిల్‌ట్యాంకు, పైపులను తొలగించారు. ఈ బస్సు తయారీకి రూ.72 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు అవుతుంద‌ట‌. 2 గంటలు చార్జింగ్‌ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఆరు హెవీ డ్యూటీ బ్యాటరీలు ఉంటాయి.. వీటి ఛార్జింగ్‌కు 1.30 నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఈ బస్సు గేర్‌ సహాయం లేకుండా స్విచ్‌ టైప్‌తో ఆటోమెటిక్‌గా నడుస్తుంది.. అలాగే గంటకు 80 కి.మీ వేగంతో వెళ్లగలదు. ఎలక్ట్రిక్‌ మోటార్‌తో స్టీరింగ్‌.. పాత పద్ధతిలో బ్రేక్‌ సిస్టం, డ్రైవర్‌కు సౌకర్యంగా డాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ద్వారా బ్యాటరీ పరిస్థితి, బస్సు ఏ గేర్‌లో వెళుతుందో తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్‌ బస్సును తిరుపతి–తిరుమల మార్గంలో తిప్పనున్నారు. అన్ని రకాలైన పరీక్షల తర్వాత ఈ బస్సు రొడ్డెక్కబోతోంది. ఏడాది కిందట ఘాట్‌ రోడ్డులో బస్సును పరీక్షించారు. అనంతరం కేంద్రం అనుమతి కోసం పుణెలోని సీఐఆర్‌టీకి పంపించారు. అక్కడ పరీక్షించన తర్వాత క్లియరెన్స్‌ ఇచ్చారు. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతను మూడేళ్ల వరకు వీరావాహన సంస్థే చూసుకుంటుంది. మరోవైపు తొలి ఎలక్ట్రిక్ బస్సు జూలై 1న అలిపిరి డిపోకు చేరుకుంటుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement