Monday, April 29, 2024

క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. షాబాద్ మండల పరిధిలోని సత్య నగర్ గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ అనితతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదేవిధంగా 15 రోజుల పాటు నిర్వహించే ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement