Friday, May 17, 2024

కలకలం రేపుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్

విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రతరం అవుతోంది. కార్మికులు, ప్రజా సంఘాలు, పార్టీలు ఆందోళనను కొనసాగిస్తున్నారు.. అలాగే ఈ నెల 25 తర్వాత సమ్మెపై కార్మికులు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ కలకలంరేపుతోంది.

‘ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. అగ్నికి ఆహుతి కావడానికి ఈరోజు 5:49 నిమిషాలకు ముహూర్తం ఉంది. కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి’ అంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. కాగా సూసైడ్ లేఖ రాసి పెట్టిన శ్రీనివాసరావు శనివారం ఉదయం నుంచి కనిపించడంలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement