Friday, May 3, 2024

ఉపాధ్యాయుడికి కరోనా.. విద్యార్థుల్లో టెన్షన్

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ కలకలం రేపింది. ఈ నెల 15 వరకు పాఠశాలకు ఉపాధ్యాయుడు హాజరైయ్యాడు. యధావిధిగా బడిలో విద్యార్థులకు పాఠాల బోధించాడు. అయితే, జ్వరంతో బాధ పడుతూ ఈ నెల 16 నుంచి పాఠశాలకు హాజరుకాలేదు. కరోనా టెస్ట్ చేయించుకోవడంతో 18న పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు సమాచారం. – బడిలో సహచరులతో స్టాఫ్ రూంలో సమయం కూడా గడిపినట్లు తెలుస్తోంది. దీంతో తోటి ఉపాద్యాయులు – ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయుడికి పాజిటివ్ రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement