Tuesday, April 30, 2024

మాది పసుపు దారే!


విశాఖ జిల్లా గాజువాకలో తెలుగుదేశం కార్పొరేటర్ల వివాదం సమిసిపోయింది. వాల్తేర్ అప్ ల్యాండ్స్ లో ఉన్న పార్టీ కార్యాలయానికి గాజువాక టీడీపీ కార్పొరేటర్లు వచ్చారు. నిన్న గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని గాజువాక ప్రాంతానికి చెందిన ఏడుగురు కార్పొరేటర్లు కలిశారు. దీంతో టీడీపీ అధిష్టానం ఆగ్రహించి ఏడుగురు కార్పొరేటర్లుకు షో కాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేను కలవడంపై పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ లెళ్ళ కోటేశ్వరరావు, పల్లా శ్రీనివాసరావు, ఇతర కార్పొరేటర్లు వివరణ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేగా అభివృద్ధికి సహకరించాలని కోరడానికే తిప్పలను కలిసినట్లు చెప్పారు. కలవడంలో ఎటువంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్నామని, ఎటువంటి ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు విజన్, అభివృద్ధి కారణంగా గాజువాకలో టీడీపీ విజయం సాధించిందని పేర్కొన్కారు. పార్టీ మారే ఆలోచన తమకు లేదని.. ఎవరో మాపై దుష్ప్రచారం చేశారని వివరించారు. ప్రజా సమస్యలపై పోరాడుతామని కార్పొరేటర్లు ఉద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement