Tuesday, May 7, 2024

వ‌లిమై మూవీ రిలీజ్ – థియేట‌ర్ ముందు పెట్రోల్ బాంబ్ దాడి

వినోద్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన చిత్రం వ‌లిమై. ఈ చిత్రం క్రైమ్, రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కింది. కాగా ఈ మూవీలో హీరోగా అజిత్ న‌టించ‌గా, విల‌న్ గా టాలీవుడ్ హీరో కార్తికేయ న‌టించాడు. బాలీవుడ్ బ్యూటీ హ్యమా ఖురేషీ.. అజిత్ సరసన నటించింది. అయితే.. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్‌ అయింది. అయితే.. అజిత్ సినిమా ఫస్ట్ డే చూసేందుకు థియేటర్లకు తరలివచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉండగా ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని గంగవల్లి మల్టీప్లెక్స్ థియేటర్ ముందు పెట్రోల్ బాంబు దాడి చోటు చోటు చేసుకుంది. బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ‘వలిమై’ మూవీ థియేటర్ ఎదుట బాంబు దాడి చేశారు. అక్కడే ఉన్న అభిమానులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు బైక్ పై పరారయ్యారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దుండగులను వెంటనే పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement