Thursday, May 16, 2024

పురుగుమందుల వ్యాపారి టోక‌రా.. రూ.30 కోట్లతో అజ్ఞాతంలోకి

ప్ర‌త్తిపాడు: గుంటూరు జిల్లాలో ఓ పురుగుమందుల వ్యాపారి న‌మ్ముకున్న వారిని న‌ట్టేట‌ముంచాడు. అన్నపు రెడ్డి నాగిరెడ్డి అనే వ్యాపారి ప్రత్తిపాడు మండల కేంద్రంలో తిరుమల ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎరువులు, పురుగుమందుల వ్యాపారం సాగిస్తున్నాడు. విస్తృత ప‌రిచ‌యాలు క‌లిగిన నాగిరెడ్డి మండల పరిధిలోని సుమారు 280 మంది రైతుల‌ను న‌మ్మించి.. వారి నుంచి పెట్టుబ‌డులుగా సుమారు. 30 కోట్ల రూపాయలు కొల్ల‌గొట్టాడు. ఆ త‌రువాత క‌నిపించండం మానేశాడు. దుకాణం తెర‌వ‌డం లేదు. దీంతో ఆందోళ‌న చెందిన రైతులు త‌మ మొత్తాల‌ను ఎగ్గొట్టి ఉద్దేశంతో అజ్ఞాతవాసం లోకి వెళ్లి పోయాడ‌ని, పోలీసులు పూర్తి స్థాయిలో విచార‌ణ చేసి.. ప‌ట్ట‌కుని త‌మ‌కు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేస్తూ… కొద్ది సేప‌టి క్రితం నుంచి ఓల్డ్ మద్రాస్ రోడ్ పై రాస్తారోకో నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement