Saturday, April 27, 2024

Breaking: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. తాజాగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డికి కరోనా బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో కిషన్‌ రెడ్డి హోం ఐసోలేషన్‌ లోకి వెళ్లారు. గత రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతగా ఉండడంతో ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement