Friday, May 3, 2024

Breaking: చిథిరై ఉత్సవాల్లో తొక్కిసలాట.. ఇద్దరు మృతి

తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జ‌రుగుతున్న‌ చిథిరై ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. శ్రీ కల్లాళగర్​ సుందరరాజా పెరుమాళ్ స్వామి ఊరేగింపునకు భారీగా జనం తరలిరాగా.. తొక్కిసలాట జరిగింది. తొక్కిస‌లాట‌లో ఓ 90 ఏళ్ల వృద్ధుడు, మరో మహిళ ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చిథిరై పండుగ ఉత్సవాలు ఏప్రిల్​ 5న మొదలయ్యాయి. ఇందులో భాగంగా స్వామి కల్లాళగర్​ సుందరరాజా పెరుమాళ్​ను బంగారు గుర్రంపై ఊరేగింపుగా వైగాయి నదికి తీసుకెళ్లారు. ఈరోజు ఉదయం నదిలో నిమజ్జనం చేశారు. ఈ ఊరేగింపును తిలకించేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. స్వామి వారి ఊరేగింపులో ఒక్కసారిగా జనం పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. తొక్కిస‌లాట‌లో ఇద్ద‌రు చ‌నిపోగా… 8మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement