Friday, May 10, 2024

ఖమ్మంలో విషాదం.. చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి

ఖ‌మ్మంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్న స‌మ‌యంలో చెట్టు కూలింది. దీంతో ఇద్ద‌రు చిన్నారులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో నలుగురు చిన్నారుల‌కు గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని జ‌రిగింది.

ఖమ్మం జిల్లా కేంద్రంలోని బ్ర‌హ్మ‌ణ బ‌జారులో మంగ‌ళవారం సాయంత్రం కొంత మంది చిన్నారులు ఖాళీ స్థ‌లంలో క్రికెట్ ఆడుకుంటున్నారు. అయితే వీరి పక్క‌నే ఉన్న భారీ చెట్టు ఒక్క సారిగా కూలింది. దీంతో దిగాంత్ శెట్టి (11), రాజ్ పుత్ ఆయుష్ (6) పై చెట్టు ప‌డింది. దీంతో ఈ ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందారు. అలాగే క్రికెట్ ఆడుకుంటున్న మ‌రో న‌లుగురు చిన్నారుల‌కు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చిన్నారులు ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement