Friday, April 19, 2024

రివ‌ర్స్ పీఆర్సీకి నిర‌స‌న‌గా దీక్ష – ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు

రివ‌ర్స్ పీఆర్సీకి నిర‌స‌న‌గా రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష చేయ‌నున్న‌ట్లు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తెలిపారు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారికి మ‌ద్ద‌తు ప‌లికారు ర‌ఘురామ‌కృష్ణరాజు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేపడతానని అన్నారు. ఉద్యోగులకు సీఎం జగన్ రివర్స్ పీఆర్సీ కానుక ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇలాంటి కోతలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ఈ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. ఈ అంశంలో తాను ఉద్యోగులకు సంఘీభావం ప్రకటిస్తున్నానని, రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యోగులకు సంఘీభావం తెలపాలని రఘురామ పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement