Sunday, April 28, 2024

జీవో 317పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు మరోసారి నిరాకరించింది. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజే జస్టిస్ సతీశ్​ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరఫు న్యాయవాదులు కోరారు. కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు విధుల్లో చేరారని..  ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.

జీవో 317పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం.. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపులన్నీ పిటిషన్లపై తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేస్తూ విచారణ ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement