Monday, May 13, 2024

TS | టీఎస్‌ ఎడ్‌సెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని బీఎడ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌ దరఖాస్తుల గడువును మరోసారి అధికారులు పొడిగించారు. మే 1వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎడ్‌ సెట్‌ కన్వీనర్‌ ప్రొ.రామకృష్ణ ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును మే 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని తమకు దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. మే 5వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఎడ్‌సెట్‌ మే 18న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement