Friday, April 26, 2024

రమేశ్ బాబుకు ప్రముఖుల నివాళి.. మహేశ్ బాబుకు మెగాస్టార్ సానుభూతి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సోదరుడు, ప్రముఖ నటుడు, నిర్మాత రమేష్ బాబు మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆయన మరణంపై కృష్ణ, మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు.

రమేష్ బాబు మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘రమేష్ బాబు మరణ వార్త తెలిసి షాక్ అయ్యాను. ఆయన మృతి దిగ్బ్రాంతికరం. కృష్ణ, మహేశ్‌తో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. దీన్ని తట్టుకునే శక్తిని వాళ్లకు కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. యంగ్ హీరోలు వరుణ్ తేజ్, నితిన్, దర్శకులు సురేందర్ రెడ్డి, గోపిచంద్ మల్లినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు మహేశ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడైన రమేష్ బాబు శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా కాలేయ సంబంధింత సమస్యలతో బాధ పడుతోన్న ఆయనకు గత రాత్రి ఆరోగ్యం క్షిణించింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించే లోపే రమేష్ బాబు తుది శ్వాసను విడిచారు.

https://twitter.com/ganeshbandla/status/1479871095033397250

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement