Monday, March 25, 2024

మిస్టర్‌ ఇండియాగా సాగర్‌ కతుర్ధాయ్‌..

మిస్టర్‌ ఇండియా బాడీ బిల్డింగ్‌ జాతీయ ఛాంపియన్‌గా మహారాష్ట్రకు చెందిన సాగర్‌ కతుర్ధాయ్‌ ఎంపికయ్యాడు. శనివారం ఖమ్మం వేదికగా నిర్వహించిన జాతీయ 13వ మిస్టర్‌ ఇండియా బాడీ బిల్డింగ్‌ పోటీల ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ మిస్టర్‌ యూనివర్స్‌ రాజు యాదవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ పోటీల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించి మిస్టర్‌ ఇండియా బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌ను ప్రకటించారు. కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీతలు ప్రేమ్‌చంద్‌డేగ్రా, టీవీ పౌలి, భాస్కరన్‌, వరల్డ్‌ బాడీ బిల్డింగ్‌ సెక్రటరీ జనరల్‌లు చేతన్‌ పథారే, హిరల్‌ షెత్‌, వహబ్‌, స్వామీ, రమేష్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement