Monday, May 6, 2024

Rangareddy: నీటకుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్‌లో ఉన్న ఓ నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. గ్రామానికి చెందిన అక్షిత్‌ గౌడ్‌, ఫరీద్‌, పర్వీన్‌.. చేపలు పట్టడానికి నీటిగుంటలోకి దిగారు. అది లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు అందులో మునిగి చనిపోయారు. గుర్తించిన స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. వారంతా పదేండ్లలోపు వారేనని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు కళ్లముందున్న చిన్నారులు విగతజీవులుగా మారడంతో వారి తల్లదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement