Sunday, May 5, 2024

మురికివాడ‌లో చెల‌రేగిన మంట‌లు.. న‌లుగురు చిన్నారులు స‌జీవ‌ద‌హ‌నం

మురికివాడ‌లో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు చిన్నారులు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఈ ప్ర‌మాదం హిమాచల్ ప్రదేశ్​ ఊనా జిల్లాలోని మురికివాడలో చోటు చేసుకుంది. మంట‌ల‌ను గమనించిన స్థానికులు వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే చిన్నారులు కాలి బూడిదయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరి మంటలు వ్యాపించకుండా ఆర్పారు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరా తీశారు. మృతులంతా బిహార్​కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నలుగురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement