Tuesday, May 21, 2024

ప్రియుడి మోజులో పడి భర్తకు మ‌ద్యంలో విష‌మిచ్చి చంపిన భార్య‌..

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నారు. ఈ ఘటనల్లో ఏ సంబంధం లేని పలువురు తనువు చాలిస్తున్నారు. తాజాగా భ‌ర్త తాగే మందులో విష‌మిచ్చి చంపింది భార్య‌. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను హత్యచేసింది భార్య. వివరాలు ఇలా ఉన్నాయి.. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భార్య శాంతి భర్తను హత్య చేయాలని నిర్ణయించారు. ప్రియుడితో కలిసి పథకం ప్రకారం భర్తకు మద్యంలో విషం కలిపి ఇచ్చింది. స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. అస‌లు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను తన ప్రియుడితో కలిసి హతమార్చినట్లు తేలింది. బాబు, శాంతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement