Tuesday, May 7, 2024

NZB | రైల్వే ప్లాట్ ఫాం, ట్రైన్ మధ్యలో ప‌డిపోయిన‌ బాలుడు.. తెగిపడిన కాలు

నిజామాబాద్ అర్బన్, (ప్రభన్యూస్) : కదులుతున్న రైలు నుంచి దిగేందుకు బాలుడు యత్నించి ప్రమాదవశాత్తు ప్లాట్ ఫాం, ట్రైన్ మధ్యలో ప‌డిపోయాడు. రెండింటి మ‌ధ్య‌ ఇరుక్కొని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం మధ్యాహ్నం జరిగింది. డిచ్ పల్లి మండలం ధర్మారం (బి) గ్రామానికి చెందిన అద్నాన్ (3) ధర్మారం నుంచి హైదరాబాద్ వెళ్లడానికి బాలుడు తల్లి, నానమ్మతో కలిసి రైల్వే స్టేషన్ కు వచ్చారు.

అప్పటికే హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న రైలు బోగీలో ఎక్కి నానమ్మతో పాటు బాలుడు రైల్లో కూర్చున్నాడు. టికెట్ తీసుకొని రావడానికి నానమ్మ కౌంటర్ వద్దకు వెళుతుండగా ఆ బాలుడు కూడా దిగబోయాడు. ఆ సంద‌ర్భంగా ప్లాట్ ఫారం, రైలు మధ్యలో ఇరుకపోయాడు. అదే క్షణంలో రైలు ముందు కదలడం వల్ల బాలుడి ఎడమ కాలు పాదం తెగిపడింది . ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్లి సమాచారం అందించి రైలును ఆపారు. బాలుడిని బయటకు తీసి చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement