Tuesday, May 7, 2024

క‌ష్ట‌ప‌డి తీసిన సినిమా విరూపాక్ష‌….

సాయిధరమ్‌ కొత్త చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్‌ నాయిక. కార్తీక్‌ దండు దర్శకుడు. బాపినీడు సమర్ప ణలో బీవీఎస్‌ఎన్‌. ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శ కుడు సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించారు. ఐదు భాషల్లో ఈ నెల 21న విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైల ర్‌ను అల్లు అరవింద్‌, దిల్‌ రాజు విడుదల చేశారు.

ఈ సంద ర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ ప్రతి మనిషికి ఓ లైఫ్‌ జర్నీ ఉంటుంది. అందులో పడటం, లేవటం సాధారణంగా జరు గుతుంటాయి. సాయిధ రమ్‌కు ఆ దేవుడు యాక్సి డెంట్‌ రూపంలో చిన్న బ్రేక్‌ వేశాడు. మళ్లిd కోలు కుని చేస్తున్న చిత్రమిదని అన్నా రు.
నిర్మాత బీవీఎస్‌ఎన్‌. ప్రసాద్‌ మా ట్లాడుతూ ”ఎన్టీఆర్‌ వా యిస్‌ ఓవర్‌తో ఈ సిని మా ప్రమోషన్స్‌ ప్రారం భించాం. పవన్‌కల్యాణ్‌ టీజర్‌ విడుదలచేశారు. అ న్నీ పాజిటివ్‌గానే కుదిరా యి ” అన్నారు.
సాయిధరమ్‌ మాట్లాడుతూ ” ఎంతో ప్రేమించి కష్టపడి చేసిన సినిమా ఇది. ఓ మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం ” అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ”ఈ మధ్య ట్రైల ర్‌ను బట్టి సినిమాలకు ఓపనింగ్స్‌ వస్తున్నాయి. విరూపాక్ష ట్రైలర్‌ చూస్తుంటే పిచ్చరేంజ్‌లో ఓపనింగ్స్‌ వస్తాయని అని పిస్తోందని” అన్నారు.
సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ దత్‌ కూడా మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement