Saturday, May 25, 2024

జ‌మ్ముక‌శ్మీర్ లో బ్యాంకు మేనేజ‌ర్ పై కాల్పులు – తీవ్ర‌గాయాల‌తో మృతి

రాజ‌స్థాన్ కి చెందిన విజ‌య్ కుమార్ జ‌మ్ము క‌శ్మీర్ కుల్గాం జిల్లా అరెమోహ‌న్ పొరాలోని ఇల్లాఖీ దెహ‌తి బ్యాంక్ బ్రాంచ్ కు మేనేజ‌ర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నాడు.నేడు ఆయన బ్యాంకుకు వెళ్తుండగా ఆయనపై కాల్పులు జరిపారు ఉగ్ర‌వాదులు. ఈ ఘటనలో బ్యాంకు మేనేజర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసు అధికారులు ట్విట్టర్‌లో వెల్లడించారు. అనంతరం ఆయనను సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన పరిస్థితి విషమించి కన్ను మూశాడు. బ్యాంక్ మేనేజర్‌పై కాల్పులు జరిగిన తర్వాతే పోలీసులు ఆ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. షోపియన్‌లో ఇదే రోజు ఓ బాంబ్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఈ బాంబ్ బ్లాస్ట్ నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలోనే బ్యాంక్ మేనేజర్‌ హత్య జరిగింది. బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ రాజస్తాన్‌లోని హనుమాన్ గడ్‌కు చెందినవారని గుర్తించారు. కొన్నాళ్లుగా జమ్ము కశ్మీర్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఊచకోతకు పాల్పడుతున్నారని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement