Sunday, May 5, 2024

ఆత్మ‌కూరు వైసీపీ అభ్య‌ర్థిగా మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి నామినేష‌న్

ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు స్థానాన్ని సోదరుడు విక్రమ్‌రెడ్డికి వైసీపీ అధిష్టానం పోటీకి అవకాశం కల్పించింది. దీంతో ఈరోజు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వైసీపీ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరుల సమక్షంలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమాను వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement