Friday, May 3, 2024

సిరిసిల్ల ఏమైనా కల్లోలిత ప్రాంతమా ? : కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

సిరిసిల్ల ఏమైనా క‌ల్లోలిత ప్రాంత‌మా.. చీటికీ మాటికి కాంగ్రెస్ లీడర్లను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక‌మ‌ని క‌రీంన‌గ‌ర్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. మండల కాంగ్రెస్ లీడర్లను అరెస్ట్ చేయడంపై పొన్నం ప్ర‌భాక‌ర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర అవిర్బవ వేడుకలను కూడా ప్రజాస్వామ్య బద్దంగా చేసుకుంటే అరెస్టులు చేయడం మంచి పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతతో పాలాభిషేకం చేస్తుంటే అడ్డుకోవడం హేయమైన చ‌ర్య అన్నారు. నయా నిజాం పాలనకు చరమ గీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ‌ని, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన రాష్ట్ర సర్కార్ మారకపోవడం సిగ్గుచేటు అన్నారు. అక్రమ అరెస్టులపై న్యాయస్థానలను ఆశ్రయించనున్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే బాధ్యత మనందరిపై ఉందని, అరెస్టయిన కాంగ్రెస్ లీడర్లను బేషరతుగా విడిచిపెట్టాలని పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement