Tuesday, May 7, 2024

గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైకి భ‌ర్త్ డే విషెస్ తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర‌రాజ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్ర‌జ‌ల‌కు సేవ‌చేస్తుంద‌న్నారు. నేటి యువ‌త‌కు ఆమె ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న్నారు. పేద పిల్లల విద్యాబుద్ధులు, వారి సర్వతోముఖాభివృద్ధి గురించి నిరంతరం ఆమె ఆలోచిస్తున్నారు. స్వతహాగా వైద్యురాలైన తమిళిసై సౌందరరాజన్ మహిళల ఆరోగ్యంపట్ల ఓ తోబుట్టువులా చూపుతున్న శ్రద్ధ సర్వదా అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం చేస్తున్న ఆలోచనలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటున్నాయి. తెలంగాణ‌తోపాటు పుదుచ్చేరికి ఇన్ చార్జి గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించ‌డాన్ని బ‌ట్టి ఆమె ప‌నితీరుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయ‌డం మ‌న ప‌నిగా భావిస్తే ప‌ద‌వులు వాటంత‌ట అవే వ‌స్తాయ‌న్నారు. ఆమెకు ఆ భగవంతుడు శతాయుష్షును ప్రసాదించాలని, ప్రజాసేవలో ఆమె నిరంతరంగా మమేకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement