Friday, May 3, 2024

ఘోర రోడ్డుప్రమాదం… 14మంది దుర్మరణం

ఓ ఘోర రోడ్డుప్రమాదంలో 14మంది అక్కడికక్కడే చనిపోగా, మరో 40మంది గాయపడ్డ విషాధ ఘటన మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో జరిగింది. శనివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. కాగా, మృతులంతా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement