Friday, May 17, 2024

దేశంలో కొత్తగా.. 2,112 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా 2,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,102 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 24,043 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 528,957 కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement