Saturday, April 20, 2024

పంతంగి టోల్ ప్లాజా పోలీస్ తనిఖీలు.. కారులో రూ.20 లక్షలు నగదు స్వాధీనం..

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. కాగా, శుక్రవారం పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. టోల్ ప్లాజా వద్ద ఓ కారును తనిఖీ చేయగా.. పెద్ద మొత్తంలో నగదును గుర్తించారు. కారులో సుమారుగా రూ.20లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న అభిషేక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement