Thursday, May 2, 2024

Breaking: ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కవ అంటూ..

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శామీర్ పేటలోని నివాసం నుంచి బయటకు వెళ్ళోద్దని పోలీసులు ఆదేశించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కార్ పై ఈటల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఆరిపోయే దీపం అంటూ విరుచుకపడ్డారు. పోలీసులు అధికార పక్షం కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు.  

బండి సంజయ్ అరెస్ట్ చేసిన తీరు ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనం అని విమర్శించారు. కరోనా నెపం పెట్టి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అణచివేసే ప్రయత్నం యదేచ్చగా కొనసాగుతుందన్నారు. ఇక్కడ ఉన్న చట్టం, ఇక్కడున్న పోలీస్ అధికార పార్టీ వారికి కొమ్ము కాస్తూ వారికి మాత్రమే రక్షణ ఇస్తూ.. వారి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం పని చేసే పార్టీలను మాత్రం గొంతు నొక్కే ప్రయత్నం చేయటం దారుణమన్నారు.

నల్లగొండలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటన సమయంలో వందలు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని గుర్తు చేశారు. అప్పుడు లేని నిభందనలు ఇప్పుడు ప్రతిపక్షాలకు మాత్రం ఎలా వర్తిస్తాయి? అని ఈటల ప్రశ్నించారు. గత కొద్ది రోజులుగా టీచర్లు, ఉద్యోగులు కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఉద్యోగల బదిలీలను ఆదర బాదరా  చేయోద్దని తెలిపారు. సీనియారిటీ నిర్ధారణ శాస్త్రీయ పద్ధతిలో జరగాలన్న ఈటల.. స్థానిక పాటించాలని కోరుతున్నారని చెప్పారు. కానీ వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగల పక్షాన బండి సంజయ్ కరీంనగర్ లో తన ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తూ ఉంటే.. వాటర్ కెనాల్ కొట్టడం, గ్యాస్ కట్టర్లతో గేట్లు కట్ చేయడం లాంటి చర్యలతో పోలీసులు బీభత్సం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరును తీవ్రంగా ఖండించారు. దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ ఎలా ఇస్తుందో ఈ ప్రభుత్వం కూడా అంతే అని హెచ్చరించారు. ఈ రోజు మీరు అణచి వేయవచ్చు  కానీ, రాబోయే కాలంలో మీకు చేదు అనుభవం తప్పదని ఈటల వార్నింగ్ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement