Sunday, May 5, 2024

ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి క‌న్నుమూత‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పి.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి (86) ఇవాళ క‌న్నుమూశారు. ఆయ‌న మృతితో టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు చెన్నైలో ఆయ‌న మృతి చెందార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోల చిత్రాల‌కు దర్శకత్వం వ‌హించిన‌ పి.చంద్రశేఖర్‌రెడ్డి(86) అనారోగ్య కార‌ణాల‌తో కన్నుమూశారు. ఆయ‌న త‌న కెరీర్‌లో సుమారు 80 సినిమాల‌కు దర్శకత్వం వహించారు. ఎక్కువగా సూపర్‌స్టార్‌ కృష్ణతో సినిమాలు తీశారు. మానవుడు దానవుడు, కొడుకులు, జగన్నాయకుడు, బడి పంతులు, విచిత్ర దాంపత్యం, రాజకీయ చదరంగం, అన్నా వదిన, పెద్దలు మారాలి వంటి సినిమాల‌కు ఆయ‌న‌ దర్శకత్వం వహించారు. ఆయన మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement