Friday, May 3, 2024

సాంకేతిక లోపం.. ఇండిగో విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్

సాంకేతిక స‌మ‌స్య‌తో ఇండిగో విమానాన్ని హైద‌రాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేశారు. కాగా ఈ విమానం బెంగుళూరు నుంచి వార‌ణాసి వెళ్తుంది. 6E897 విమానంలో సాంకేతిక స‌మ‌స్య వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ముందుజాగ్ర‌త్త‌గా ఆ విమానాన్ని శంషాబాద్ విమానాశ్ర‌యానికి డైవ‌ర్ట్ చేసిన‌ట్లు ఇండిగో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఉద‌యం 6.45 నిమిషాల‌కు విమానాన్ని అత్య‌వ‌స‌రంగా దించారు. ఆ విమానంలో 137 మంది ప్యాసింజెర్లు ఉన్నార‌ని, వాళ్లంతా క్షేమంగా ఉన్న‌ట్లు డీజీసీఏ(DGCA) తెలిపింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ద‌ర్యాప్తున‌కు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. అయితే వార‌ణాసి వెళ్లే ప్ర‌యాణికుల కోసం మ‌రో విమానాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఇండిగో విమానంలో సాంకేతిక స‌మ‌స్య ఉత్ప‌న్నం అయిన‌ట్లు పైలెట్ గుర్తించార‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement