Tuesday, May 14, 2024

టీడీపీ సీనియ‌ర్ నేత శ‌త్రుచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రాజు క‌న్నుమూత – నారా లోకేశ్ దిగ్భ్రాంతి

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోన్న టీడీపీ సీనియ‌ర్ నేత శ‌త్రుచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రాజు క‌న్నుమూశారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా 1989 నుంచి 1994 వరకు బాధ్యతలను నిర్వర్తించారు. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత శత్రుచర్ల ఆ పార్టీలో చేరి, కీలక నేతగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత… వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు చంద్రశేఖర్ రాజు సోదరుడు అవుతారు. అంతేకాదు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి స్వయానా మామయ్య అవుతారు. శత్రుచర్ల మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. శత్రుచర్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement