Monday, April 29, 2024

బిల్డింగ్ పై నుండి జారి ప‌డి – ద‌ర్శ‌కుడు మృతి

బిల్డింగ్ పై నుండి జారి ప‌డి ద‌ర్శ‌కుడు పైడి ర‌మేశ్ మృతి చెందారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ లో ఓ భవనంపై నుంచి జారి పడి ఆయన దుర్మరణం చెందారు. ఆ బిల్డింగ్ లోని నాలుగో అంతస్తులో ఆయన ఉంటున్నారు. నిన్న సాయంత్రం వాకింగ్ కు వెళ్లి ఆయన తిరిగి వచ్చారు. ఈ సమయంలో వర్షం ప్రారంభం కావడంతో… బాల్కనీలో ఆరేసిన బట్టలు తీసే ప్రయత్నం చేశారు. కొన్ని బట్టలు కరెంట్ తీగలపై పడటంతో రాడ్ తో వాటిని తీసేందుకు యత్నించారు. దీంతో షాక్ కొట్టి ఆయన కింద పడిపోయారు. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2018లో ‘రూల్’ అనే సినిమాను ఆయన తెరకెక్కించారు. మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉండగానే ఈ దుర్ఘటన సంభవించింది. ఒక యంగ్ డైరెక్టర్ మృతి చెందడంపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement