Monday, April 29, 2024

ఒంగోలులో టీడీపీ మ‌హానాడు – ఒక్క‌రోజే

ఒంగోలులో టీడీపీ మ‌హానాడుని నిర్వ‌హించ‌నున్నారు..అది కూడా ఒక్క‌రోజే..దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కరోనా నేపథ్యంలో రెండేళ్లపాటు ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి ప్రత్యక్షంగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. అయితే, ఈసారి ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న ఒక్క రోజుకే మహానాడును పరిమితం చేయాలని నిర్ణయించారు. ఈసారి ఒంగోలు శివారులో మహానాడును నిర్వహించనున్నారు. అంతకుముందు రోజు నాలుగైదు వేల మంది ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 28న నిర్వహించే మహానాడుకు ప్రతి ఒక్కరు హాజరుకావొచ్చని టీడీపీ నేతలు తెలిపారు. అలాగే, ఆ రోజు నిర్వహించే భారీ బహిరంగ సభలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించి ఏడాదిపాటు కొనసాగిస్తారు.నేడు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభిస్తారు. వాట్సాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్‌ల ద్వారానూ సభ్వత్వం తీసుకోవచ్చు. అలాగే, ఇప్పటికే సభ్యత్వం కలిగిన వారు సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement