Thursday, April 25, 2024

పెరుగుతోన్న క‌రోనా కేసులు

క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. దేశంలో నిన్న 2,380 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 13,433 మంది చికిత్స తీసుకుంటున్నార‌ని తెలిపింది. క‌రోనా నుంచి నిన్న 1,231 మంది కోలుకున్నారని, ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి మొత్తం సంఖ్య మొత్తం 4,25,14,479గా ఉందని పేర్కొంది. నిన్న క‌రోనా వ‌ల్ల 56 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మృతుల సంఖ్య మొత్తం 5,22,062కి పెరిగింద‌ని వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement