Saturday, May 4, 2024

ఇచ్చిన హామీని నెర‌వేర్చిన సూర్య‌..విరాళంగా 15ల‌క్ష‌ల చెక్కు..

జై భీమ్ చిత్రంలో అంద‌రిని క‌దిలించిన పాత్ర చిన‌త‌ల్లి. ఇది కేవ‌లం పాత్ర‌మాత్ర‌మే కాదు రియ‌ల్ గా చిన్న‌త‌ల్లి ఉంది..ఆమె పేరు పార్వ‌తి. చిన్న గుడిసెలో నివ‌సిస్తుందామె. కాగా జైభీమ్ రిలీజ్ అయిన‌ప్పుడు త‌మిళ స్టార్ హీరో సూర్య పార్వ‌తికి స‌హాయం చేస్తాన‌ని చెప్పాడు. ఇచ్చిన హామీని నెర‌వేర్చుకున్నాడు. పార్వతిని సూర్య స్వయంగా కలిసి రూ.15 లక్షల చెక్కును అందజేశారు. తన తరపున రూ.10 లక్షలు, తన చిత్ర నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ తరపున రూ.5 లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్. బాలకృష్ణన్, రాజకీయ నాయకత్వ కమిటీ సభ్యుడు జి. రామకృష్ణన్ తదితరులు పాల్గొని నటుడు సూర్యకు కృతజ్ఞతలు తెలిపారు. సూర్య మాట‌ల మ‌నిషికాద‌ని చేత‌ల మ‌నిష‌ని మ‌రోసారి నిరూపించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement