Sunday, April 28, 2024

సూర్య‌కుమార్ అరుదైన రికార్ట్.. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచ‌రీలు

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ అరుదైన రికార్డ్ ని న‌మోదు చేశాడు.. టీ20 మ్యాచ్‌లో చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయిన సూర్య.. బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీ20ల్లో అతడికిది మూడో సెంచరీ. ఈ శతకంతో అతడి పేరుపై ఓ రికార్డు నమోదైంది. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అతడి కంటే ముందున్నాడు. 2017లో ఇండోర్‌లో శ్రీలంకతోనే జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 35 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు.

సూర్య తర్వాత కేఎల్ రాహుల్ (46) మూడో స్థానంలో ఉండగా, ఆ తర్వాత రెండు స్థానాల్లోనూ సూర్యకుమార్ యాదవ్ ఉండడం గమనార్హం. గతేడాది నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో, మౌంట్‌మాంగనూయిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో సూర్యకుమార్ సెంచరీలు బాదాడు. అంతేకాదు, ఓపెనర్‌గా కాకుండా మధ్యలో బ్యాటింగ్‌కు దిగి మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గానూ సూర్యకుమార్ చరిత్ర సృష్టించాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement